సూర్యాపేట : దళితబంధు పథకం దేశానికే ఆదర్శoగా నిలుస్తుందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. పథకంతో దళితుల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పునకు శ్రీకారం చుట్టొచ్చన్నారు. గురువారం స్థానిక రవి కన్వెన్షన్ హాలులో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అధ్యక్షతన దళితబంధు పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ అధ్యక్షురాలు గుజ్జ దీపిక, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, బొల్లం మల్లయ్య యాదవ్, శానంపుడి సైదిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళిత బాంధవుడు సీఎం కేసీఆర్ అని, తెలంగాణ సాధించుకున్నాక అన్ని వర్గాల ప్రజల అవసరాలను పరిగణలోకి తీసుకొని రాజకీయాలకు అతీతంగా పార్టీలు అమలు చేస్తున్నామన్నారు.
లబ్ధిదారుల జీవితంలో గొప్ప సువర్ణ అవకాశామని, పథకం ద్వారా దళితుల జీవితంలో ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు విప్లవాత్మక మార్పురావాలని పిలుపునిచ్చారు. లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లపై పూర్తిస్థాయి అవగాహన కల్పించి, యూనిట్ గ్రౌండింగ్ చేయనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ జన్మదినం రోజున లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేయడం శుభసూచకమన్నారు. జిల్లాలో త్వరలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు దఫాలుగా 4100 కుటుంబాలకు నియోజకవర్గాల వారీగా దళితబంధు పథకం అమలు చేస్తామన్నారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ దళితులకు గొప్ప అవకాశమని, యూనిట్ల మంజూరులో నష్టం రాకుండా అధికారులు పూర్తి అవగాహన కల్పించి ఆర్థిక చేయూతకు తోడ్పాటునందించాలన్నారు. అదనపు కలెక్టర్లు ఎస్ మోహసన్రావు, పాటిల్ హేమంత్ కేశవ్, సీఈవో సురేష్, పీడీ కిరణ్కుమార్, జిల్లా ఉద్యాన అధికారి శ్రీధర్, సీపీజీవో వెంకటేశ్వర్లు, పరిశ్రమల జీఎం తిరుపతయ్య, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.