హైదరాబాద్ : దళితుల నిజమైన ఆత్మబంధువుగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, ముఖ్యంగా దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు దళిత బంధును అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. నగరంలోని హపీజ్పేట్ డివిజన్ అంబేద్కర్నగర్కు చెందిన దళితుడు యాదగిరికి మంజూరైన స్విఫ్ట్కారును కార్పొరేటర్ జగదీశ్వర్గౌడ్తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధును మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.
ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్ధిదారులు ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. తొలివిడతగా నియోజకవర్గంలో వంద మంది దళితులకు దళిత బంధును అందిస్తున్నట్లు వెల్లడించారు. దళిత బంధు పథకం వల్ల ఎంతోమంది పేదలు యజమానులయ్యారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకులు గౌతం గౌడ్, శ్రీనివాస్యాదవ్, రఘునాథ్, కృష్ణ, నాగరాజు, గోపాల్, సీతారాం తదితరులు పాల్గొన్నారు.