రెండో విడత దళితబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని దళితబంధు ఐక్య వేదిక పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు నముండ్ల సంపత్ మహరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో దళితబంధు లబ్ధిదారులతో కలిసి ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ జిల్లా నాయకుడు రామిళ్ల కిరణ్, టీఎస్ ఎమ్మార్పీస్ జిల్లా అధ్యక్షుడు ఎలుకటి రాజయ్య, ప్రధాన కార్యదర్శి రేణుకుంట్ల మహేశ్తో పాటు 100 మంది లబ్ధిదారులు పాల్గొన్నారు.