Dalithbandhu | ఖిలావరంగల్, మే 16: బలగం సినిమా లో తన పాట ద్వారా ప్రేక్షకులను మెప్పించిన పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. వరంగల్ జిల్లా దుగ్గొండికి చెందిన మొగిలయ్యకు రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో రెండేండ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఊ రూరా తిరుగుతూ యక్షగానాలు, బుర్రకథ లు చెప్పుకొంటూ జీవనం సాగిస్తున్న మొగిలయ్యకు ఖరీదైన వైద్యం చేయించుకునే స్థోమత లేదు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.
దీంతో సర్కారు స్పందించి దళితబంధు పథకం కింద మొగిలయ్యను ఎంపిక చేశారు. ఈ మేరకు మంగళవారం మొగిలయ్య దంపతులను శాలువాతో సత్కరించిన వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య దళిత బంధు మంజూరు పత్రా న్ని అందజేశారు. దళితబంధు పథకం మంజూరు చేయించిన బోయినపల్లి వినోద్కుమార్, ఎర్రబెల్లి దయాకర్రావు, పెద్ది సుదర్శన్రెడ్డికి మొగిలయ్య, కొమురమ్మ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.