హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ ఢిల్లీలో సైకిల్ యాత్రను చేపట్టారు. తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం నుంచి పార్లమెంట్ వరకు సైకిల్ యాత్ర కొనసాగించారు. కరెన్సీ నోట్లపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటో ముద్రించాలని డిమాండ్ చేశారు. సమితి జాతీయ నాయకులు పాల్గొన్నారు.