లక్ష్మీదేవిపల్లి, జూలై 23 : ఆపదలో ఉన్న ఆ కుటుంబానికి సాయం చేస్తామని చెప్పి.. వారి బ్యాంకు ఖాతాను ఖాళీ చేశారు సైబర్ నేరగాళ్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లికి చెందిన భాస్కర్ నాలుగు నెలల కుమారుడైన మేఘనాథ్ లివర్ ఇన్ ఫెక్షన్తో బాధపడుతున్నాడు. లివర్ మార్పిడికి రూ.18 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు తెలి పారు.
బాలుడి తల్లిదండ్రులు.. బంధువులు, దాతల సహాయం కోరుతూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీన్ని ఆసరా చేసుకొని సైబర్ నేరగాళ్లు గురువారం రాత్రి భాస్కర్కు ఫోన్ చేసి.. సోనూసూద్ చారిటబుల్ ట్రస్టు నుంచి మాట్లాడుతున్నామని, ఖాతాలో డబ్బులు వేస్తామంటూ బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు నంబర్లు, ఓటీపీ కూడా తీసుకొన్నారు. వెంటనే వారి అకౌంట్లో ఉన్న రూ.14 వేలు డ్రా చేశారు. గమనించిన భాస్కర్ లక్ష్మీదేవిపల్లి పోలీసులను ఆశ్రయించారు.