హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ): వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోవటంతో మాదకద్రవ్యాలను విక్రయించటం ప్రారంభించిన ఒక సినీ నిర్మాతను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి 82.75 గ్రాముల కొకైన్, రూ.2.05 లక్షల నగదుతోపాటు కారు, నాలుగు సెల్ఫోన్లు కలిపి మొత్తం రూ.78.5 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం..ఖమ్మం జిల్లాకు చెందిన సుంకర కృష్ణప్రసాద్చౌదరి 2016లో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. కబాలి తెలుగు సినిమాను నిర్మించాడు.
సర్దార్ గబ్బర్సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు, కనితన్ నిసిమాలకు డిస్ట్రిబ్యూటర్గా పనిచేశాడు. సినిమా ఇండస్ట్రీలో ఆశించిన ఫలితాలు రాకపోవటంతో గోవాకు వెళ్లి ఓహెచ్ఎం పేరుతో క్లబ్ను ప్రారంభించాడు. అందులోనూ నష్టాలు రావటంతో గత ఏప్రిల్లో హైదరాబాద్ తిరిగి వచ్చాడు. నగరానికి వచ్చే సమయంలో గోవాలో ఉండే పెటిట్ ఎబ్యూజర్ అలియాస్ గాబ్రియల్ అనే నైజీరియన్ నుంచి 100 కొకైన్ ప్యాకెట్లను కొనుగోలు చేశాడు. ఇందులో 10 ప్యాకెట్ల కొకైన్ తనే వాడుకొని, మిగతా వాటిని స్నేహితులకు విక్రయించాడు. సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు కిస్మత్పూర్ ఎక్స్రోడ్ వద్ద కొకైన్ను విక్రయిస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.