హైదరాబాద్ సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ): పోక్సో కేసు బాధితురాలు మైనరేనని పోలీసులు నిర్ధారించినట్టు సమాచారం. బాలికకు సంబంధించిన జనన ధ్రువీకరణ పత్రంపై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విచారణ జరిపారు. బాధితురాలి జనన ధ్రువీకరణపై తలెత్తిన వివాదం నేపథ్యంలో పోలీసులు శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని వైద్య విభాగానికి చేరుకొని జీహెచ్ఎంసీ అధికారులు జారీచేసిన బాధితురాలి జనన ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించారు.
అది వాస్తవమైన పత్రమేనని నిర్ధారించుకున్న అనంతరం సర్కిల్ కార్యాలయంలోని రికార్డులు సైతం పరిశీలించారు. అంతేగాకుండా బాధితురాలు జన్మించిన దవాఖానలోని రికార్డులనూ వారు పరిశీలించారు. దవాఖాన, జీహెచ్ఎంసీ రికార్డులను సరిచూసిన తర్వాత బాలికను మైనర్గా పోలీసులు నిర్ధారించినట్టు తెలిసింది.