హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ స్థాయి హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఉద్యోగాల పేరుతో అమాయకులను వ్యభిచార వృత్తిలోకి దింపుతూ, మానవ అక్రమ రవాణాకు సంబంధించిన 39 కేసుల్లో 17 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో రాడిసన్ హోటల్ మేనేజర్ రాకేశ్ ఉన్నాడు. ఈ ముఠాకు చిక్కిన 14,190 మందిని వ్యభిచార వృత్తిలోకి దింపినట్టు గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం మీడియాకు వివరించారు.
అంతర్జాతీయ స్థాయిలో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు నవంబర్ 15న సన్సిటీలో సల్మాన్ అలియాస్ వివేక్, ఇర్ఫాన్ అలియాస్ వికాస్ ను అరెస్టు చేశారు. వీరిచ్చిన సమాచారంతో అదేనెల 18న అదెమ్ అలియాస్ అర్నవ్, సమీర్, హర్బిందర్ కౌర్ను సోమాజిగూడలో పట్టుకొన్నారు. వీరి వాట్సాప్ గ్రూప్లు, కాంటాక్టులను పరిశీలించగా దేశవ్యాప్తంగా అమ్మాయిలను సరఫరా చేసే నెట్వర్క్ వెలుగులోకి వచ్చింది.
ఈ ముఠాకు డ్రగ్స్ సరఫరాదారులతో సంబంధాలు ఉన్నాయి. ఈ ముఠా వ్యభిచారంతోపాటు డ్రగ్స్ దందా కూడా చేస్తున్నట్టు సీపీ వెల్లడించారు. నిందితుల నుంచి 34 స్మార్ట్ఫోన్లు, మూడు కార్లు, ల్యాప్టాప్, 2.5 గ్రాముల డ్రగ్ను స్వాధీనం చేసుకొన్నామని, వీరిపై పీడీయాక్టు ప్రయోగిస్తామని చెప్పారు. చాకచక్యంగా ముఠాను పట్టుకొని కేసు ఛేదించిన డీసీపీ కవిత, సిబ్బందిని పోలీసు కమిషనర్ అభినందించారు. బాధితుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, ముంబై, కోల్కతా, అస్సాం, బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్, ఉజ్బెకిస్తాన్, రష్యాకు చెందిన వారు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
నెట్వర్క్ నిర్వహణ ఇలా