హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : భవిష్యత్తులో సైబర్ నేరాలే అత్యంత సవాల్గా మారనున్నాయని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. సైబర్ నేరాలు వేగంగా రూపాంతరం చెందుతున్నందున కృత్రిమ మేధస్సు, ఆధునిక సాంకేతికత వినియోగిస్తూ ముందుకు సాగాలని అధికారులకు సూచించారు.
తెలంగాణలో సైబర్ నేరాల నియంత్రణ, బాధితులకు వేగవంతమైన సేవలు, సాంకేతిక సామర్థ్యాల పెంపు లక్ష్యంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపడుతున్న కార్యక్రమాలపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు.