హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 30 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం శుక్రవారం బదిలీచేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న అంజనీకుమార్ను అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) డీజీగా నియమించింది. హైదరాబాద్ సీపీగా మరో సీనియర్ అధికారి సీవీ ఆనంద్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. సీనియర్ ఐపీఎస్లతోపాటు ఇటీవల ఐపీఎస్ హోదా పొందిన నాన్ క్యాడర్ అధికారులను ప్రభుత్వం వివిధ ప్రాంతాలకు బదిలీచేసింది.