హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ మహిళ నుంచి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు మహిళ నుంచి అధికారులు 268.4 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బంగారాన్ని పేస్ట్ రూపంలోకి మార్చి ఓ టేపులో పెట్టి.. వీపు వెనుకలో అతికించుకొని తరలిస్తుండగా తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.13.73లక్షల విలువ ఉంటుందని అధికారులు వెల్లడించారు. సదరు మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.