శంషాబాద్ రూరల్, ఆగస్టు 10: శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుడి నుంచి 552 గ్రాముల బంగారాన్ని గురువారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడిపై అనుమానం వచ్చి అధికారులు తనిఖీ చేశారు.
అతని జేబుల్లోంచి పేస్టుగా మార్చిన బంగారం బయటపడగా, స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.33.53 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.