హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వానకాలం సాగు జోరుగా సాగుతున్నది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో మొన్నటివరకు సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ తాజాగా అది పుంజుకున్నది. గతేడాదితో సమానంగా 1.13 కోట్ల ఎకరాలకు పైగా వివిధ పంటలు సాగయ్యాయి.
గతేడాది ఇదే సమయానికి మొత్తం 1.14 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 42.47 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈ ఏడాది ఇది 45.69 లక్షల ఎకరాలకు చేరింది. పత్తి 48.34 లక్షల ఎకరాల్లో సాగైంది.