హైదరాబాద్ : జనగామలో ప్రభుత్వ కార్యాలయాలకు వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. రూ.9 లక్షల విద్యుత్ బిల్లులు బకాయి ఉన్నందున, జనగామ లోని 22 ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారంటూ పలు వార్త ఛానెళ్లలో వచ్చిన వార్తలపై సీఎస్ స్పందించారు. సంబంధిత విద్యుత్ పంపిణీ ఉన్నతాధికారులతో మాట్లాడి, వెంటనే విద్యుత్ పునరుద్ధరించాలని సీఎస్ ఆదేశించారు.