హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ ఈ నెల 12న రామగుండం రానున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని జాతికి అంకి తం చేయనున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై శుక్రవారం బీఆర్కేభవన్లో సీఎస్ సోమేశ్కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడు తూ.. ప్రధాని పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేసేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూ చించారు. శాంతి భద్రతలు, బందోబస్తు ఏర్పాట్లను బ్లూబుక్ ప్రకారం చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీజీపీ మ హేందర్రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్, రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ సీఈవో ఏకే జైన్, ఎస్సీఎస్ సునీల్శర్మ, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, అడిషనల్ డీజీ జితేందర్, సీటీ సీపీ సీవీ ఆనంద్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.