హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): సద్దుల బతుకమ్మ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంతో పాటు విదేశాల్లో మహిళలు బతుకమ్మలు పేర్చి ఆటలు ఆడారు. పర్యాటక, సాంస్కృతిక శాఖలు, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్, ఆర్థిక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి హాజరై, మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
జర్మనీ, కెనడా, జపాన్ టోక్యో నగరంలోని కోమట్సుగావా పార్కులో, ఉగాండా రాజధా ని కంపాలాలోని టీటీడీ ప్రాంగణంలో తెలంగాణా అసోసియేషన్ అఫ్ ఉగాండా ఆధ్వర్యం లో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు.