హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నూతన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) బ్రాంచిని బుధవారం సీఎస్ శాంతికుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. సచివాలయ ఉద్యోగులకు ఉత్తమ సేవలు అందించాలని బ్యాంక్ అధికారులకు సూచించారు.
బ్యాంక్ అధికారులతో కలిసి స్ట్రాంగ్ రూమ్, కంప్యూటర్ సెంటర్ను పరిశీలించారు. యూబీఐ చీఫ్ మేనేజర్ విజయ్కుమార్ మాట్లాడుతూ.. బీఆర్కేఆర్ భవన్లో ఉన్న యూబీఐ బ్రాంచి తన సేవలను ఇకపై కొత్త సచివాలయ బ్రాంచిలో అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ కారే భాసర్రావు, రీజినల్ హెడ్ కే శ్రీధర్బాబు, బ్యాంక్ మేనేజర్ అనూష తదితరులు పాల్గొన్నారు.