హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు ఉద్యోగకాలాన్ని మరోసారి పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మరో మూడు నెలలపాటు పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. వాస్తవానికి సీఎస్ రామకృష్ణారావు ఈ నెల 31తో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. అయితే మూడు నెలల పొడిగింపుతో ఆయన జూన్ వరకు ఉద్యోగంలో కొనసాగనున్నారు.
సీఎస్ రామకృష్ణారావుకు ఉద్యోగ కాలం పొడిగించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. నిరుడు ఏప్రిల్లో ఆయన ఉద్యోగ కాలాన్ని ఏడు నెలలపాటు పొడిగించింది. వాస్తవానికి నిరుడు ఏప్రిల్లో సీఎస్గా బాధ్యతలు చేపట్టిన ఆయన ఆగస్టులో ఉద్యోగ విరమణ కావాలి. అయితే ఆయన ఉద్యోగ కాలాన్ని ఏడు నెలల పొడిగింపుతో ఇప్పటివరకు కొనసాగారు. తాజాగా మరోసారి మూడు నెలలు పొడిగించడంతో జూన్ నెలాఖరు వరకు ఆయన సీఎస్గా కొనసాగనున్నారు.