యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాని(Lakshmi Narasimha Swamy)కి భక్తుల(Devotees) రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆలయ పరిసరాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయ పరిసరాలు ఎటుచూసినా భక్తులే దర్శనమిచ్చారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. ఆలయంలో అభిషేక పూజలు, నిత్య కల్యాణాల్లో భక్తులు పాల్గొన్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతున్నది.