నాంపల్లి కోర్టులు, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): మంత్రి శ్రీనివాస్గౌడ్తోపాటు అధికారులపై కేసు నమోదుచేసే అధికారం జిల్లా కోర్టుకు లేదని 1వ అదనపు మెట్రోపాలిటన్ జిల్లా జడ్జి రమాకాంత్ స్పష్టం చేశారు. సీఆర్పీసీలోని సెక్షన్ 200 ప్రకారం మెజిస్ట్రేట్ కోర్టు పరిధిలోనే ఈ కేసు నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులను త్వరగా విచారించేందుకు మాత్రమే ప్రత్యేక కోర్టులు ఏర్పాటయ్యాయని తెలిపారు.
ఈ అంశాలపై వాదన వినిపించేందుకు కొంత సమయం కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరడంతో తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు. ఈ వ్యవహారంలో తమ వాదనలు వినిపించేందుకు అనుమతించాలన్న అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల విన్నపాన్ని జడ్జి నిరాకరించారు.