జగిత్యాల: ఊళ్లోని చెరువలో రెండు మృతదేహాలు లభించడంతో జగిత్యాలలో కలకలం రేగింది. జిల్లాలోని ధర్మపురం చెరువులో ఇద్దరు యువతుల మృతదేహాలు లభించాయి. ఉప్పరిపేటకు చెందిన ముగ్గురు యువతులు బుధవారం నుంచి కనిపించడం లేదు. వారికోసం కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది.
ఒకే వీధిలో నివసించే ముగ్గురు యువతుల్లో వందన, మల్లిక అనే అమ్మాయిల మృతదేహాలు చెరువలో దొరికాయి. మరో యువతి గంగాజల మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ముగ్గురు యువతులు ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.