ముంబై: సుప్రీంకోర్టు విశ్వసనీయత ఆకాశమంత ఉన్నతమైనదని, కొంతమంది వ్యాఖ్యలతో అదేమీ క్షీణించదని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. రాజ్యాంగం అత్యున్నతమైనది, పవిత్రమైనదని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్కు వ్యతిరేకంగా బాంబే లాయర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు, రాజ్యాంగంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని రిజుజు, ధన్కర్ వ్యాఖ్యలు సడలేట్లు చేశాయని, వారిని పదవులకు అనర్హులుగా ప్రకటించాలని బీఎల్ఎ కోరింది. ‘పిటిషనర్ సూచించిన విధంగా రాజ్యాంగాన్ని అమలు చేసే పదవుల్లో ఉన్నవారిని తొలగించలేం. తీర్పుపై న్యాయబద్ధమైన విమర్శలను అనుమతిస్తాం. రాజ్యాంగానికి కట్టుబడి ఉండటం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి.’ అని కోర్టు చెప్పింది.