హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి క్రెడాయ్ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. గురువారం హైదరాబాద్ క్రెడాయ్ ప్రతినిధి బృందం సీఎంను కలిసి అభినందనలు తెలిపింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్థిరాస్తి రంగాభివృద్ధికి అండగా నిలవాలని కోరారు.
పరిశ్రమకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని సీఎం హామీ ఇచ్చారు. కార్యక్రమం లో హైదరాబాద్ క్రెడాయ్ అధ్యక్షుడు వీ రాజశేఖర్రెడ్డి, ప్రెసిడెంట్-ఎలక్ట్ జైదీప్రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీ జగన్నాథరావు, ఉపాధ్యక్షులు కోటి, రాంబాబు, మురళీమోహన్, సంయుక్త కార్యదర్శులు క్రాంతికిరణ్రెడ్డి, నితీశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.