దుమ్ముగూడెం, మార్చి 20: కేంద్రంలో ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పోరాటం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం చేరిన జనచైతన్య యాత్రలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. ప్రధాని మోదీ కేంద్రంలో అధికారం చేపట్టాక సామాన్యులు అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. నిత్యావసర సరుకులు, వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు నాయకులు, ప్రజలు, మేధావులు ఐక్యంగా పోరాటాలు చేయాలని సూచించారు.