మునుగోడు, అక్టోబర్ 28: బీజేపీది ప్రభుత్వాలను పడగొట్టే నీచ చరిత్ర అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. 400 కోట్లతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించి అడ్డంగా దొరికిపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. అయినా తమ తప్పును కప్పిపుచ్చుకొనేందుకు బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించాలని కోరుతూ టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం శ్రేణులతో కలిసి శుక్రవారం మునుగోడులో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తమ్మినేని మాట్లాడు తూ.. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను ఎందుకు గెలిపించాలో, బీజేపీని ఎందు కు ఓడించాలో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు.