గ్రామ పంచాయితీల ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల కాలపరిమితి 2024 జనవరి 31తో పూర్తవుతున్నందున తక్షణమే ఎన్నికలు నిర్వహించాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పాలక వర్గాలను రద్దు చేసి స్పెషల్ ఆఫీసర్లు నియమించాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోందని తమ్మినేని వీరభద్రం అన్నారు. దీన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని అన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామ పంచాయితీలకు విధిగా ప్రతి ఐదేండ్లకు ఒకసారి ఎన్నికలు జరపాలని.. ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకవర్గాలను కొనసాగించాలని సూచించారు.