హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన ఘటనకు వ్యతిరేకంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రజక కుటుంబం మీద అగ్రకులాలు ఆధిపత్య ధోరణితో మహిళలని చూడకుండా దేవాలయ ప్రవేశాన్ని అడ్డుకోవడంతోపాటు దాడి చేయడం దారుణమని మండిపడ్డారు.
ఈ దాడిలో రెండునెలల పసిపాప మృతి చెందడం ఎంతో కలచివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈఘటనలో పోలీసులు దాడిచేసిన వారిపై కాకుండా, బాధితులపై కేసు నమోదు చేయడం ఆశ్యర్యాన్ని కలిగించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ దాడిపై జిల్లా ఎస్పీ, డీఎస్పీ, కలెక్టర్ స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. వెంటనే దాడికి పాల్పడిన వారితోపాటు గ్రామ సర్పంచ్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేయాలని కోరారు. సీఎం రేవంత్రెడ్డి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని విమర్శించారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి కనువిప్పు కలిగిలా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.