హైదరాబాద్: తెలంగాణలో తన బలాబలాలను తేల్చుకోవడానికి సీపీఎం (CPM) సిద్ధమైంది. ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగింది. ఇన్నాళ్లు కాంగ్రెస్తో (Congress) పొత్తు ఉంటుందని వేచిచూసిన సీపీఎం.. సీట్ల కేటాయింపు విషయమై ఆ పార్టీ ఎటూ తేల్చకపోవడంతో 17 స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం 14 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసింది. తాజాగా రెండో జాబితాలో (Second List) మరో రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో స్థానంపై స్పష్టత రావాల్సి ఉన్నది.
నల్లగొండ (Nalgonda) జిల్లాలోని హుజూర్నగర్ (Huzurnagar) నుంచి మల్లు లక్ష్మి, నల్లగొండ నియోజకవర్గం నుంచి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డికి టికెట్లు కేటాయించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) ప్రకటించారు. పాలేరును బరిలోకి దిగుతున్న ఆయన.. నేడు నామినేషన్ వేయనున్నారు. కాగా, సీఎంపీ పోటీచేస్తున్న 16 నియోజకవర్గాలు హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఒకటి చొప్పున ఉండగా మిగిలినవి ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఉన్నాయి.
పాలేరు- తమ్మినేని వీరభద్రం
వైరా- భూక్య వీరభద్రం
సత్తుపల్లి- మాచర్ల భారతి
ఖమ్మం- ఎర్ర శ్రీకాంత్
మధిర- పాలడుగు భాస్కర్
భద్రాచలం- కారం పుల్లయ్య
అశ్వారావుపేట- పిట్టల అర్జున్
మిర్యాలగూడ- జూలకంటి రంగారెడ్డి
నకిరేకల్- చిన వెంకులు
భువనగిరి- కొండమడుగు నర్సింహా
హుజూర్నగర్- మల్లు లక్ష్మి
నల్లగొండ- ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
జనగామ- మోకు కనకారెడ్డి
ఇబ్రహీపట్నం- పగడాల యాదయ్య
పటాన్చెరు- జే. మల్లికార్జున్
ముషీరాబాద్- దశరథ