ఆదిలాబాద్, మార్చి 23(నమస్తే తెలంగాణ)/నిర్మల్: కేంద్రంలోని బీజేపీ దుష్టపాలనను ప్రజలు అంతమొందించాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. గురువారం ఆదిలాబాద్ జిల్లాలో సీపీఎం జన చైతన్యయాత్రను బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వీరయ్యతో కలిసి ప్రారంభించా రు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడు తూ ఎనిమిదేండ్లుగా అవినీతి, అక్రమాలు, మతోన్మాదం పేరిట బీజేపీ ఆగడాలను ప్రజలకు వివరించడానికే ఈ యాత్ర చేపట్టినట్టు వివరించారు.
బీజేపీ ప్రభుత్వం దేశ సంపద ను అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నదని ఆరోపించారు. కేంద్రంపై విమర్శలు చేసిన ప్రతిపక్ష నేతలపై మోదీ ప్రభుత్వం ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నదని, ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణ పేరిట వేధింపులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం మతాల పేరిట ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నదని ధ్వజమెత్తారు. సీపీఎం చేపట్టిన జన చైతన్య యాత్ర నిర్మల్కు చేరుకున్న సందర్భంగా ఆ పార్టీ నేత వీరయ్య మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ భావాలతోనే కేంద్రంలోని బీజేపీ సర్కారు నడుస్తున్నదని, మతోన్మాదాన్ని ప్రేరేపించి ఓటు రాజకీయలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు.