పెద్దపల్లి : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని బొట్లవనపర్తి వార్డు సభ్యులు, తెలంగాణ వార్డు మెంబర్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బత్తిని సంతోష్, సీపీఎం నాయకులు సోమవారం ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula )సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ గెలుపు కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు పెంచాల రాజేశం, బొట్ల రాములు, రెడపాక లక్ష్మణ్, మోటపలుకుల లక్ష్మణ్ పాల్గొన్నారు.