హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగా ణ): రైతులు పండించిన వరి, మక్కజొన్న, ఇతర పంట ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొనుగోలు కేంద్రాల్లోని అస్తవ్యస్త పరిస్థితులతో రైతులు అల్లాడుతు న్నా.. అధికారులు, ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఐకేపీ, పీఏసీఎస్, మార్కెటింగ్ కమిటీల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం, నల్లగొండ, ఉత్తర తెలంగాణ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గన్నీ బ్యాగుల కొరతతో రైతు లు ఒక్కో బస్తాకు రూ.30 అదనంగా చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. ఆదివారం రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలను సీపీఎం బృందాలు సందర్శించాలని, 11న అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించాలని జాన్వెస్లీ పిలుపునిచ్చారు.