CPM | హైదరాబాద్ : తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేయాలని సీపీఎం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు భువనగిరి ఎంపీ అభ్యర్థిగా జహంగీర్ పేరును ఆ పార్టీ ప్రకటించింది. మిగిలిన 16 స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని ఆ పార్టీ తెలిపింది. దీంతో ఆశావహులు టికెట్ల కోసం పార్టీ పెద్దలను ఆశ్రయిస్తున్నారు.
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు మే 13న ఎన్నికలను నిర్వహించనున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు. ఏప్రిల్ 18 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు.