హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో మరో మూడు స్థానాలకు సీపీఎం అభ్యర్థులను ప్రకటించింది. ముగ్గురు సభ్యులతో కూడిన మూడో జాబితాను ఆ పార్టీ మంగళవారం విడుదల చేసింది. మునుగోడు, ఇల్లందు, కోదాడ నియోజకవర్గాల అభ్యర్థులను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.
మునుగోడుకు దోనూరు నర్సిరెడ్డి, ఇల్లెందు దుగ్గి కృష్ణ, కోదాడ స్థానానికి మట్టిపెల్లి సైదులును అభ్యర్థులుగా ఖరారు చేసింది.