షాద్నగర్, మార్చి 16: బీజేపీ ప్రభుత్వానికి ఈడీ, సీబీఐ సంస్థలు వేట కుక్కలుగా మారాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ‘రాజ్యాంగం-మనువాదం’ అనే అం శంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజల పక్షాన నిలిచి, దేశంలోని అవినీతి రూపుమాపడంలో ప్రధాన పాత్ర పోషించాల్సిన సీబీఐ, ఈడీ వంటి ప్రధాన సంస్థలు బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా మారడం బాధకరమని అన్నారు.
సీబీఐ, ఈడీ పేరుతో మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులకు గురిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని దు య్యబట్టారు. బీజేపీరహిత ప్రభుత్వాలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతూ అరాచకాలకు ఒడిగడుతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తామని చెప్పారు. దేశంలో మార్పును తీసుకొచ్చేందుకు తమవంతుగా కృషిచేస్తామ ని, అందుకు బీఆర్ఎస్ నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. బీజేపీ దురాగతాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు సీపీఐ కార్యకర్తలు కృషిచేయాలని సూచించారు.