హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సీఎం కేసీఆర్ బయటపెట్టిన వీడియోల ఆధారంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సంతోష్పై కేసులు నమోదు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. 8 రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూల్చడంలో ప్రధాని, హోంమంత్రుల పాత్ర ఉన్నదని వీడియోలో మఠాధిపతులు పదే పదే చెప్పడాన్ని ఆయన ప్రస్తావించారు. ఆ వీడియోల ఆధారంగా ఆయా రాష్ట్రాల హైకోర్టులు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఈ వీడియోలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అన్ని రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులకు పంపినట్టు సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని న్యాయవ్యవస్థ సంకేతాలివ్వాలని కోరారు. తప్పుడు ఆరోపణలతో కవి వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబా, జర్నలిస్టు కప్పన్పై కేసులు పెట్టి జైళ్లలో వేశారన్నారు. ప్రజాస్వామ్యంపై అణు దాడి