హనుమకొండ, జూన్ 16: గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. మంగళవారం హనుమకొండలోని గుండ్లసింగారం భూపోరాట కేంద్రంలో సురవరం సుధాకర్రెడ్డినగర్ పేరుతో నిర్మించిన సీపీఐ కార్యాలయాన్ని పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తకళ్లపల్లి శ్రీనివాస్రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు జీవో 58 ప్రకారం పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు.