సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తన లక్ష్మణరేఖను దాటుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గవర్నర్ తన పరిధిని దాటి ప్రజా దర్బార్ను నిర్వహించి రాజకీయ కేంద్రం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారని గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
రాజ్భవన్లో మహిళల దర్బార్ ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. సహజంగా ఎవరైనా ప్రతినిధుల వర్గం వస్తే కలవొచ్చు, వినతిపత్రాన్ని స్వీకరించి ప్రభుత్వానికి పంపించొచ్చు, అలా కాకుండా గవర్నర్ రాజకీయ కార్యకలాపాలతో రాజ్భవన్ను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ తటస్థ వైఖరితో ఉండాలని, ఆ మేరకే గవర్నర్ పాత్ర పరిమితం కావాలని హితవు చెప్పారు. గవర్నర్ రాజకీయాలు చేయడం ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని, వెంటనే తలపెట్టిన దర్బార్ను రద్దుచేయాలని డిమాండ్చేశారు.