హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ):ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ ఉద్యోగులకు ఎక్కువగా వేతనాలు ఇస్తున్నామనే సందర్భంలో ఏపీ పరిస్థితిని మంత్రి హరీశ్రావు పోల్చారని.. ఆ వ్యాఖ్యలపై రాద్ధాంతం తగదని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ నిర్బంధకాండను, ఇతర సంఘం నాయకులు సమావేశంలో ఉదహరిస్తే.. దాని ఆధారంగానే హరీశ్రావు తన ప్రసంగంలో ఏపీతో పోల్చారని తెలిపారు. దీన్ని నేరంగా భావించి ఏపీ ఉద్యోగ సంఘాల నాయకుడు ఖండించడం సరికాదని హితవు పలికారు. ఏపీలో అంతా సవ్యంగా ఉంటే నిరసనలు, చలో విజయవాడ ఎందుకు చేపట్టారని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ ప్రశ్నించారు. మంత్రిపై ఏపీ మంత్రులు, ఉద్యోగ నేత వెంకటేశ్వర్లు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదమని టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పేర్కొన్నారు. మంత్రి హరీశ్రావు వ్యాఖ్యల్లో తప్పేమి ఉన్నదని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ప్రశ్నించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులపై జగన్ సరార్ నిరంకుశంగా ప్రవర్తించింది నిజం కాదా? అని నిలదీశారు.
మంత్రి హరీశ్రావు వ్యాఖ్యల్లో తప్పేమి ఉన్నదని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ప్రశ్నించారు. ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై జగన్ సరార్ నిరంకుశంగా ప్రవర్తించింది నిజం కాదా? అని నిలదీశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల శాంతియుత నిరసనలపై ఉకుపాదం మోపలేదా? పీఆర్సీ, సీపీఎస్ అంశాల్లో ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లలేదా? ఉద్యోగులు, ఉపాధ్యాయులను పోలీస్స్టేషన్లకు పిలిపించి వేధించడం, గృహనిర్బంధాలు, వారి కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేయడం నిజం కాదా? టీచర్లను మద్యంషాపుల ముందు నిలబెట్టారా లేదా? అని నిలదీశారు. హరీశ్రావు ఉన్నది చెప్తే వైసీపీ నేతలకు ఉలికిపాటేందుకు? అని చురకలంటించారు.