హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో బీజేపీకి పుట్టగతులు లేవని, భవిష్యత్తులో కూడా ఆ పార్టీని నిలువరించడానికి వామపక్ష, లౌకిక, ప్రగతిశీల శక్తులు కంకణబద్ధులు కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి కోరారు. ఫాసిస్టు విధానాలను అవలంబిస్తున్న బీజేపీని తెలంగాణలో పాగా వేయకుండా నిలువరించడంలో వామపక్షాలు ప్రధాన పాత్ర పోషించాయని సోమవారం తెలిపారు. బీజేపీ నిరంకుశ పాలనకు మునుగోడు ఉపఎన్నిక చెంపపెట్టు లాంటిదని అన్నారు. కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని రాజగోపాల్రెడ్డి అరోపించడం సిగ్గుచేటని మండిపడ్డారు. మునుగోడులో కమ్యూనిస్టులు బలంగా ఉన్నారని, వారి సహకారంతోనే అక్కడ టీఆర్ఎస్ గెలిచిందని చాడ పేర్కొన్నారు.