సిద్దిపేట టౌన్, ఫిబ్రవరి 11: పోడు భూములకు పట్టాలు ఇస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడాన్ని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి స్వాగతించారు. వనసంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదన్నారు. సిద్దిపేటప్రెస్క్లబ్లో నిర్వహించిన సీపీఐ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పేదరికాన్ని పెంచి పోషిస్తూ పేదలపై భారం మోపుతున్నదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నదని విమర్శించారు. అదాని గ్రూప్కు సంబంధించిన ఆస్తులు అడ్డగోలుగా పెరడగం, ఆ తర్వా త షేర్లు పడిపోవడం వంటి చర్యలతో రెండు లక్షల కోట్ల వరకు బ్యాంకులు దివాలా తీసే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని పార్లమెంట్లో డిమాండ్ చేస్తే నరేంద్ర మోదీ ప్రతిపక్షాల నోర్లు నొక్కేశారని విమర్శించారు. అసలు అదాని గ్రూప్ ఆస్తులు ఎలా పెరిగాయి? ఎలా క్షీణించాయో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు.