హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): సింగరేణి ఎన్నికల తర్వాత రాజకీయంగా కాంగ్రెస్, సీపీఐ మధ్య తగువు వచ్చిందనేది తప్పుడు ప్రచారం అని సీపీఐ జాతీ య కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. ఈ విషయమై నారాయణ శుక్రవారం ఒక వీడియో విడుదల చేశారు.
కాంగ్రెస్, సీపీఐ మధ్య వచ్చిన భేదాభిప్రాయాలతో ఈ రెండు పార్టీ లు విడిపోతాయని కొందరు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కార్మిక సంఘాల ఎన్నికలకు, రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సింగరేణిని దక్కించుకోవడం సంతోషంగా ఉంద ని నారాయణ చెప్పుకొచ్చారు.