హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : జమిలి ఎన్నికల నిర్వహణకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఆరోపించారు. ఇండియా కూటమి బలపడుతుందనే భయంతోనే బీజేపీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నదని విమర్శించారు.
గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జమిలి ఎన్నికలకు మొగ్గు చూపుతున్న కేంద్రం అత్యవసరంగా సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంటు సమావేశాలు నిర్వహించనున్నదని తెలిపారు. ఈ సమావేశాల్లో జమిలి ఎన్నికలకు అనుగుణంగా ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ బిల్లును తీసుకొచ్చే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.