హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల పెంపు, పోడు భూములకు పట్టాలు అందజేతకు జీవో140 విడుదల చేయడం, భూమి లేని గిరిజనులకు ‘గిరిజన బంధు’ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ నిర్ణయించడం పట్ల సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం వెంటనే 10శాతం ఎస్టీల రిజర్వేషన్ల పెంపును ఆమోదించాలని డిమాండ్ చేశారు.