హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ)ః డబ్బు, పదవులతో ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేయడమే కొత్త తరహా రాజకీయమా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్పాషా బీజేపీపై నిప్పులు చెరిగారు. సోమవారం ఆయన సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో బీజేపీ అసలు రంగు బయటపడిందని విమర్శించారు.
పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. విభజన హామీలు అమలు చేయని బీజేపీకీ తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు. పార్టీ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడులో రెండో స్థానం కోసమే బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయని చెప్పారు. రాజగోపాల్రెడ్డి సీపీఐకి కూడా ద్రోహం చేశారని మండిపడ్డారు.