హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి హిందీ బాగా లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అవహేళన చేసేలా మాట్లాడటం ఆమె అహంకారానికి నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు.
తోటి సభ్యుని పట్ల అగౌరవంగా మాట్లాడటం సమంజసం కాదని హితవుపలికారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్ర బీజేపీ నాయకులకు ఉన్న చులకన భావానికి ఈ ఘటన అద్దం పడుతున్నదని విమర్శించారు. తక్షణమే ఆమె తన వ్యాఖ్యలను వెనకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.