సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ
హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్ల కనుసన్నల్లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పనిచేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. సీపీఐ ఆధ్వర్యంలో గురువారం ఇంటింటికీ పాదయాత్రను హైదరాబాద్లోని ఆనంద్బాగ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
దేశంలో లాభాలతో నడిచే బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఉకు, బొగ్గు, రైల్వే, విమానయానం, ఆయిల్ కంపెనీలు, నౌకాశ్రయం, రక్షణరంగంతో పాటు అన్నిరంగాలను ప్రైవేటీకరణ చేసేలా చట్టాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ దేశ సంపదను కొళ్లగొట్టి అదానీ, అంబానీలకు పెడుతున్నాడని ధ్వజమెత్తారు. నిరంకుశ హిట్లర్ తరహా పాలనను సాగిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లో ఓడించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎన్ బాలమల్లేశ్ పాల్గొన్నారు.