హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ విధానాలతో నిత్యవసర వస్తువులు, సరుకుల ధరలు పెరగడాన్ని
వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఉద్యమించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై అదనపు భారం వేస్తోందని ఆరోపించారు.
పెంచిన ధరలను తగ్గించాలని మే 27న అన్ని మండల, పట్టణ కేంద్రాల్లో నిరసనలు చేయాలని, 30వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు, 31న హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర ఆందోళన నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో నిరసనలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.