కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సీపీఐ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుడుతున్నట్టు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యు డు చాడ వెంకటరెడ్డి తెలిపారు.
బీజేపీ తీరుకు నిరసనగా
సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి
హుస్నాబాద్, మార్చి 31: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సీపీఐ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుడుతున్నట్టు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యు డు చాడ వెంకటరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 14వ తేదీ నుంచి మే 15 వరకు పల్లెపల్లెకు సీపీఐ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. మోదీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని సూచించారు.
ప్రతిపక్ష పార్టీల నాయకులను దుర్మార్గులుగా చూపుతూ స్వపక్షంలోని అవినీతిపరులను వెనకేసుకొస్తూ బీజేపీ ప్ర భుత్వం అనేక కుట్రలకు తెరలేపుతున్నదని విమర్శించారు. ప్రజలు నిత్యం వాడే మందులపై పన్ను వేయడం, పెట్రో ఉత్పత్తులు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం పెనుభారం మోపుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తు తం రూ.168 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, బీజేపీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్లలో రూ.106 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆరోపించారు. కేవలం ఈ ఏడాదిలోనే 15.4 లక్షల కోట్ల అప్పులు తెచ్చి దేశాన్ని అప్పుల్లో ముంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు.