ఖమ్మం మామిళ్లగూడెం, డిసెంబర్ 29: ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ను కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. డిప్యూటేషన్పై ఐదేండ్లపాటు ఆయన ఎన్ఐఏ ఎస్పీగా విధులు నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఈ నెల 20న ఉత్తర్వులు జారీ చేసింది.
2013 తెలంగాణ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి వారియర్ మూడేండ్లుగా ఖమ్మం పోలీస్ కమిషనర్గా విధు లు నిర్వహిస్తున్నారు. ఆయనను వెంటనే తెలంగాణలో విధుల నుంచి రిలీవ్ చేసి, కేంద్ర హోం శాఖలో రిపోర్టు చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ శాంతికుమారికి లేఖ అందింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు వారియర్ కేంద్ర సర్వీసులో తన సేవలు అందించనున్నారు.